ప్రపంచంలోనే అత్యుత్తమ దొంగ ప్రియాంకా చోప్రా : కంగనా రనౌత్
ఎప్పుడు వార్తల్లో ఉండేందుకు ప్రయత్నించే తారల్లో కంగనా రనౌత్ ముందు వరుసలో ఉంటుంది.. తన గురించే అందరూ మాట్లాడుకోవాలని తెగ తాపత్రయ పడుతుంది. అంతేకాదు ఈ భామ వివాదాలకు పెట్టింది పేరు. ఎవరిని
ఎప్పుడు వార్తల్లో ఉండేందుకు ప్రయత్నించే తారల్లో కంగనా రనౌత్ ముందు వరుసలో ఉంటుంది.. తన గురించే అందరూ మాట్లాడుకోవాలని తెగ తాపత్రయ పడుతుంది. అంతేకాదు ఈ భామ వివాదాలకు పెట్టింది పేరు. ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేస్తుందో తెలియదు. ఎవరిని ఎంత మాటైనా అవలీలగా అనేస్తుంది. ఎవరు ఏమన్నా ఆమె పట్టించుకోదు.
ఎప్పటికప్పుడు మాటల తూటాలు పేల్చుతూ ఉంటుంది. గతంలో హృతిక్ రోషన్ను ఉద్దేశించి 'సిల్లీ ఎక్స్' అంటూ ఆమె చేసిన కామెంట్ ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. హృతిక్ గురించే కాదు. ఇంకా చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీల గురించి సెన్సేషనల్ కామెంట్లు చేసింది కంగనా.
తాజాగా ఆమె టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను టార్గెట్ చేసుకుంది. అసలు విషయం ఏంటంటే... హీరోయిన్లలో మరో కోణాన్ని బయటికి తీస్తున్న నేహా ధూపియా షోలో కంగనా ప్రియాంక చోప్రా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికన్ టీవీ షో ''క్వాంటికో'' ద్వారా సూపర్ పాపులరైన ప్రియాంక గురించి నేహా మాట్లాడుతూ ఇండియన్ హీరోయిన్ల స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకెళ్లిన ప్రియాంకకు ఎలాంటి అవార్డిస్తారు అని అడిగితే.. ఆమె ప్రపంచంలోనే అత్యుత్తమ దొంగ అనేసింది కంగనా. అంతేకాక ప్రియాంకది 'ఫేక్ స్మైల్' అని.. ఆమె నవ్వులో నిజాయితీ ఉండదని సంచలన వ్యాఖ్యులు చేసింది. నిజానికి కంగనాకు.. ప్రియాంకకు మధ్య మంచి స్నేహం ఉంది.
వీళ్లిద్దరూ కలిసి గతంలో 'ఫ్యాషన్' సినిమా కూడా చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. రెండేళ్ల కిందట కంగనాకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డు రాగా.. 'మేరీకోమ్' సినిమాకు ప్రియాంకకు జ్యూరీ పురస్కారం దక్కినపుడు ఇద్దరూ కలిసి పార్టీ కూడా ఇచ్చారు. మరి అంత మంచి బంధం ఉన్న ప్రియాంక గురించి కంగనా ఇటువంటి కామెంట్లు ఎందుకు చేసిందోనని బాలీవుడ్ వర్గాలు తలలు పట్టుకుంటున్నారు.