Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సహజనటి గుర్తింపు సౌందర్య తర్వాత నిత్యామీనన్‌దే : బాలకృష్ణ

''అలా మొదలైంది'' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన నిత్యామీనన్ ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయం రెండింటిని సమపాళ్లలో కలబోసి ''ఇష్క్'' సినిమాలో నటించి మంచి పేరు సంపాదిం

సహజనటి గుర్తింపు సౌందర్య తర్వాత నిత్యామీనన్‌దే : బాలకృష్ణ
, శుక్రవారం, 26 ఆగస్టు 2016 (12:33 IST)
'అలా మొదలైంది'' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన నిత్యామీనన్ ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయం రెండింటిని సమపాళ్లలో కలబోసి ''ఇష్క్'' సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉందీ మలయాళ భామ. గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ''సన్ ఆఫ్ సత్యమూర్తి'', ''రుద్రమదేవి'', ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీ ఆర్‌తో ''జనతా గ్యారేజ్'' ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. 
 
అంతేకాదు నారా రోహిత్ సరసన ''ఒక్కడినే'' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ మాట్లాడుతూ సౌందర్య తర్వాత సహజ నటిగా నిత్య మీనన్ నిరూపించుకుంటుంది. ఆమె ఇంకొంచెం పొడుగు ఉండుంటే నేను తీద్దామనుకున్న ''నర్తనశాల'' సినిమాలో ద్రౌపది పాత్ర ఆమెతో చేయించే వాడిని అని ఆమెపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. 
 
ఈమెకున్న క్రేజ్‌ని అడ్డంపెట్టుకొని రెండేళ్ళ క్రితం నాటి 'మాలిని 22' మూవీని పేరు మార్చి 'ఘటన'గా రిలీజ్ చేయబోతున్నారట. ''మాలిని 22'' మూవీ 2014లోనే పూర్తయినా రిలీజ్ కాలేదు. దీంతో ఈ పాత సినిమాకి పేరు మార్చి కొత్త సినిమాగా కలర్ ఇచ్చి రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పివిపి సినిమా, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి కాంబినేషన్‌లో ''రాజుగారి గది2''