''మజ్ను'' ఓవర్సీస్ రైట్స్ ఎంతో తెలుసా?
వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న హీరో నాని. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న చిత్రం ''మజ్ను''. ఈ సినిమాలో నాని సరసన అను ఎమ్మాన్యుయెల్, ప్రియా శ్రీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ''ఉయ్యాల జంపాలా'' చిత్రానిక
వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న హీరో నాని. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న చిత్రం ''మజ్ను''. ఈ సినిమాలో నాని సరసన అను ఎమ్మాన్యుయెల్, ప్రియా శ్రీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ''ఉయ్యాల జంపాలా'' చిత్రానికి దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో నాని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రని పోషిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా.. అప్పుడే ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేటుకు ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకోవడానికి పోటీ పడుతుండగా.. ఓవర్సీస్లో భారీ రేటుకే అమ్ముడైంది. ఇప్పటికీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు మంచి స్పందన రావడంతో, ఈ సినిమా యూఎస్ ప్రేక్షకులకి అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందనే అంచనాల నేపధ్యంలో ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఏజీఇండియా మీడియా ఎల్ఎల్సీ అనే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ''మజ్ను'' ఓవర్సీస్ రైట్స్ని రూ.2.75 కోట్లకు సొంతం చేసుకుంది. నానికి ఓవర్సీస్లో క్రేజ్ ఉండడం వల్ల అంతమొత్తం ధర పలికిందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.