Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

19న మహేష్ బాబు "ఆగడు".. నాగార్జున క్విజ్ షో స్పూఫ్!

19న మహేష్ బాబు
, గురువారం, 4 సెప్టెంబరు 2014 (16:24 IST)
ఇతర హీరోలపై పంచ్‌లు వేయడంలోనూ, ఇమిటేట్ చేయడంలోనూ టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల మంచి దిట్ట. ముఖ్యంగా ఒక సన్నివేశాన్ని ఏ విధంగా చూపిస్తే ప్రేక్షకులు అమితానందం పొందుతారో ఆయనకు తెలిసినట్టు మరొకరికి తెలియకపోవచ్చు. ఈ క్రమంలో తన సినిమాలలో ఎప్పటికప్పుడు పలువురు హీరోలపై సెటైర్లు వేస్తూ క్యాష్, క్యాచ్ చేసుకుంటున్నారు. 
 
లోగడ వచ్చిన 'దూకుడు' సినిమాలో ఎమ్మెస్ నారాయణతో పాపులర్ ఆర్టిస్టుల్ని ఇమిటేట్ చేయించి మంచి కామెడీ పండించాడు. తాజా చిత్రం 'ఆగడు'లో ఇదేవిధంగా మరో హాస్యానికి తెరతీసినట్టు సమాచారం. 'ఆగడు' సినిమాలో నాగార్జున టీవీ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పై స్పూఫ్ పెట్టాడట. నాగార్జున చేసిన ఈ క్విజ్ షో బాగా పాపులర్ అయిన విషయం తెల్సిందే. 
 
ఈ షోపై 'ఆగడు'లో స్పూఫ్ క్రియేట్ చేశాడట. అయితే, ఇది సెటైర్ లాంటిది కాదనీ, ఎవరినీ కించపరిచే విధంగా కూడా ఉండదనీ అంటున్నారు. ఓ కీలకమైన సందర్భంలో మహేష్ బాబు హాట్ సీట్లో కూర్చుని ఇతరులను ప్రశ్నలు వేస్తాడట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెల 19న రిలీజ్ చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu