Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్న కాలు పెడితే మాస్‌... మరో అన్న పెడితే మటాష్‌... ఎవరు కోటీశ్వరుడు ఫినిష్షా....?!!

అన్న కాలు పెడితే మాస్‌... మరో అన్న పెడితే మటాష్‌... ఎవరు కోటీశ్వరుడు ఫినిష్షా....?!!
, మంగళవారం, 29 జులై 2014 (17:10 IST)
చిరంజీవి ఎక్కడ కాలుపెట్టినా.. ఫ్యాన్స్‌ జేజేలు కొడుతుంటారు. రాజకీయాల్లోనూ కొట్టారు. కానీ అధికార పార్టీ ఓటింగ్‌లో గల్లంతయింది. ఇక అప్పట్నుంచి ఆయన కాలు పెడితే.. అంతే సంగతులంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మరో వార్త ప్రచారం జరుగుతోంది. నాగార్జున మా టీవీలో నిర్వహిస్తున్న 'ఎవరు కోటీశ్వరుడు'కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ప్రోగ్రామ్‌ను ఎలా నిర్వహించాలో నాగార్జున కూడా అమితాబ్‌ వద్దకు వెళ్ళి పూర్తిగా వివరాలు సేకరించారు. అయితే ఇప్పుడు బాగా రన్నింగ్‌లో వున్న కోటీశ్వరుడుకి ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నారట.
 
ఎందుకంటే.. వచ్చేనెల నుంచి స్టార్‌టీవీలో అమితాబ్‌ ప్రోగ్రామ్‌ మళ్ళీ కొత్త హంగులతో రాబోతుందట. మళ్ళీ తెలుగులో నాగార్జున నుంచి ఇటువంటి ప్రోగ్రామ్‌ చూడాలంటే... 2015 జూన్‌ వరకు ఆగాల్సిందేనని సమాచారం. ఇప్పటికే చాలామంది పార్టిసిపెంట్స్‌ వస్తున్నా..వారి పేర్లు పరిశీలిస్తూ ఏడాది ఓపిక పట్టమని చెబుతున్నట్లు సమాచారం. 
 
కాగా, కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌లో మధ్యమధ్యలో అంటే ఆదివారం పూట వివిధ సెలట్రిటీలను నాగార్జున చూపిస్తుండేవారు. అందులో చిరంజీవి ఎపిసోడ్‌ కూడా వుందట. అయితే చిరంజీవి ఎపిసోడ్‌తో కోటీశ్వరుడుకు ముగింపు పలునున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంటే... అన్న కాలు పెడితే మాస్‌.... మరో అన్న కాలు పెడితే మటాష్‌ అంటూ సెటైర్లు వేస్తున్నారట చిరు అంటే కిట్టనివాళ్లు.

Share this Story:

Follow Webdunia telugu