తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేక బాలీవుడ్కు వెళ్లిపోయిన గోవా బ్యూటీ ఇలియానా.. హైదరాబాద్లో ఉన్న తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఈ గోవా బ్యూటీకి మణికొండలోని ల్యాంకో టవర్స్లో విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. దీన్ని రూ.1.25 కోట్లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం దీని మార్కెట్ రేటు రూ.2 కోట్ల పైమాటగానే ఉంది.
అయితే, ప్రస్తుతం ఈ గోవా చిన్నదానికి టాలీవుడ్లోనే కాదు దక్షిణ భారత్లో ఎలాంటి అవకాశాలు లేవు. దీంతో బాలీవుడ్కు వెళ్లిపోయింది. అక్కడ తన అందచందాలతో ఆకట్టుకోవడంతో ఈ అమ్మడుకి మంచి అవకాశాలే వస్తున్నాయి. దీంతో అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇప్పటికే ముంబైలోని బాంద్రాలో కోటి రూపాయలు పైబడే ఫ్లాట్ వుంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఇదే అంశంపై ఇలియానా తల్లి సమీర ఇప్పటికే పలువురు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను సంప్రదించి తన ఇంటిని అమ్మి పెట్టాలని కోరుతోందంట. విభజన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోవచ్చనే వార్తలు వెలువడుతుండటంతో వీలైనంత తొందరగా తన ఇంటిని అమ్మేయాలని భావిస్తోంది.