అక్షయ్ కుమార్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే టాలీవుడ్ హీరోలు కంగుతినాల్సిందే..!
సినిమా బడ్జెట్ వంద కోట్లు దాటుతున్న నేపథ్యంలో హీరోల రెమ్యునేషన్స్ సైతం అదే స్దాయిలో పెరుగుతూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రానికి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తీసుక
సినిమా బడ్జెట్ వంద కోట్లు దాటుతున్న నేపథ్యంలో హీరోల రెమ్యునేషన్స్ సైతం అదే స్దాయిలో పెరుగుతూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రానికి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తీసుకుంటున్నాడో తెలిస్తే కంగుతినాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా కోసం ఏకంగా రూ. 56 కోట్లు తీసుకోనున్నాడని బాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం.
''యారియాన్'', ''సనమ్ రే'' సినిమాల దర్శకురాలు దివ్య ఖోస్లా తీయబోయే సినిమాలో అక్షయ్ కుమార్ను తీసుకోవడానికి ఆలోచిస్తున్నారట. పూర్తి స్దాయి లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని దివ్య భర్త భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. వరుసగా అక్షయ్ సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో తన రెమ్యునేషన్ని అమాంతంగా పెంచేసినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అంతేకాకుండా ఆ మొత్తంలో డబ్బును ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఒప్పుకున్నారట. కాగా ఇటీవలే విడుదలైన ''హౌస్ ఫుల్ 3'' చిత్రం వంద కోట్లను మొదటివారమే కలెక్ట్ చేసి అక్షయ్ కుమార్ స్టామినా ఏంటో చూపెట్టింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ''రుస్తం'', ''రోబో 2'' చిత్రాల్లో నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ''రోబో 2'' లో ఆయన విలన్గా చేస్తున్నారు.