రాంచరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన గోవిందుడు అందరివాడేలే చిత్రం అక్టోబరు 1వ తేదీన విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిట్ అయిందో ఫట్ అయిందే ఫ్యాన్సే తేల్చుకోలేకపోతున్నారట. ఐతే చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాత్రం అలాంటి సందేహాలను వదిలేయమంటున్నారట.
అంతేకాదు... అప్పట్లోనే 40 కోట్ల రూపాయల మార్క్ను దాటేసిందని కూడా చెప్పారు. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నారు. తమకు 20 నుంచి 30 శాతం నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి కారణం హుధుద్ తుఫాను కారణంగా వారు చూపిస్తున్నారు. అలాగే ప్రమోషన్స్ కూడా అంతగా చేయకపోవడం వల్ల చిత్ర కలెక్షన్స్ రోజురోజుకీ తగ్గిపోయాయని వారు అంటున్నారు.
మరోవైపు గతంలో ఆరెంజ్ చిత్రంలో రాంచరణ్ పిలక వేసుకుని నటించారని, అది కూడా బాక్సాఫీసు వద్ద తుస్సుమని పేలిపోయిందనీ, ఇపుడు దీనికి కారణం అదే అయి ఉంటుందని భావిస్తున్నారు.