పొద్దస్తమానం సెల్ ఫోన్తో గడపడం కాదు పక్కన పెళ్ళాం వుంది.. గీతా మాధూరి - నందు ఆసక్తికర సంభాషణ
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి వివాహం నటుడు నందుతో జరిగిన విషయం తెలిసిందే.. పెళ్లికి ముందు నుండే గీతా మాధురి, నందు ప్రేమించుకుంటూ వచ్చారు. వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇరు వర్గాల పెద్దలు అంగ
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి వివాహం నటుడు నందుతో జరిగిన విషయం తెలిసిందే.. పెళ్లికి ముందు నుండే గీతా మాధురి, నందు ప్రేమించుకుంటూ వచ్చారు. వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇరు వర్గాల పెద్దలు అంగీకారంతో జీవిత భాగస్వాములయ్యారు. నటుడిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నందు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన 'ఫోటో' సినిమాతో తెరంగేట్రం చేశారు.
ఇటీవల వరుస సినిమాలతో నందు తన నటనతో ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే వినాయక చవితి సందర్భంగా... ఎంతసేపు సెల్ ఫోన్తో కాలం గడపడం కాదు పక్కన పెళ్ళాం అనేది ఒకటి ఉంది దానితో మాట్లాడదాం, ఆమెని చూసుకుందాం అనే ధ్యాస నందుకి ఉండేలా చేయి స్వామి అని గణేశుడిని కోరుకుందట గీతా. దీంతో నందు ఒక్కసారిగా నా పరువు తీసేసావ్ కదే... అంటూ తల పట్టుకున్నాడు. అయితే గీతా మాధురి నందూ పరువు తీసినప్పటికీ నందు మాత్రం ఈ జన్మలోనే కాదు ఎన్నెన్ని జన్మలెత్తినా గీతా మాధురే నా భార్యగా కావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.