'నేనే రాజు నేనే మంత్రి'లో న్యూస్ ఛానల్ బాస్గా కేథరిన్.. ఖైదీకి తర్వాత..?
మెగాస్టార్ 150వ సినిమాలో ఐటమ్ సాంగ్లో చిందులేసే ఛాన్సును నోటి దురుసుతో చేజార్చుకున్నప్పటికీ.. కేథరిన్ చేతిలో ఆఫర్లు మస్తుగానే ఉన్నాయి. 'సరైనోడు'తో యంగ్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్, ఓ న
మెగాస్టార్ 150వ సినిమాలో ఐటమ్ సాంగ్లో చిందులేసే ఛాన్సును నోటి దురుసుతో చేజార్చుకున్నప్పటికీ.. కేథరిన్ చేతిలో ఆఫర్లు మస్తుగానే ఉన్నాయి. 'సరైనోడు'తో యంగ్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్, ఓ న్యూస్ఛానెల్కి బాస్గా తాజా సినిమాలో కనిపిస్తుందని టాక్ వస్తోంది.
ఈ సినిమా వివరాల్లేంటంటే.. రానా- కాజల్ అగర్వాల్ జంటగా రానున్న మూవీ 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫిల్మ్కి నిర్మాత సురేష్బాబు. అంతా ఓకే అయితే ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో కేథరిన్ ఓ న్యూస్ ఛానల్కు బాస్గా అలరించనుంది. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. స్టోరీలో తన క్యారెక్టర్ వివరించగానే వెంటనే కేథరిన్ ఓకే చెప్పిందట.
ప్రస్తుతం మీడియాకు సంబంధించిన అంశాలపై షూట్ చేయడం కూడా జరిగిపోయిందని ఇన్సైడ్ సమాచారం. ఖైదీ నుంచి డ్రాపైన తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ లేవు. రానా సినిమాతో అయినా కేథరిన్కు అదృష్టం కలిసి రావాలని సినీ పండితులు అంటున్నారు.