Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధృవ కోసం కెమరామెన్‌ను మళ్లీ మార్చిన రాంచరణ్.. ఎందుకంటే...

ధృవ కోసం కెమరామెన్‌ను మళ్లీ మార్చిన రాంచరణ్.. ఎందుకంటే...
, శనివారం, 28 మే 2016 (11:21 IST)
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌కి సినిమాటోగ్రాఫర్ షాక్ ఇచ్చాడు. అసలు విషయం ఏంటంటే దర్శకుడు సురేందర్, మెగా హీరో రాంచరణ్ కాంబోలో తెరకెక్కునున్న చిత్రం ''ధ్రువ''. తమిళంలో ఘనవిజయం సాధించిన ''తని ఒరువన్''కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ళలేదు. ఇప్పటికే రెండు సార్లు చరణ్ షూటింగ్‌ను రద్దు చేయించాడని కూడా ఆమధ్య వార్తలొచ్చాయి. దీంతో యూనిట్లో వున్న ఓ టెక్నిషియన్ డేట్స్‌కి ఇబ్బందులు తలెత్తింది. 
 
బాలీవుడ్‌లో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న టాప్ కెమరామెన్ అయిన ఈయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈయన స్థానంలో పి.ఎస్. వినోద్‌ని కెమెరామెన్‌గా తీసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. గతంలో పవర్ స్టార్ నటించిన ''పంజా'', అక్కినేని నాగార్జున నటించిన ''మనం'', ''ఊపిరి'' సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. 
 
కాగా మెగా హీరోల సినిమాల నుంచి కెమెరామెన్‌లు తప్పుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ మూవీ ''సర్దార్ గబ్బర్ సింగ్'' సినిమా నుంచి కెమెరామెన్ విన్సెంట్ డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రాఫర్‌లు మెగాహీరోలకి అచ్చిరాదని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో 'బాహుబలి' షూటింగ్