Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆయన చూపు నా మీద పడలేదన్న సలోని

ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలీదు. అది తెలీకే నేను ఇలా వున్నానని నటి సలోని తెలియజేస్తుంది. హీరోయిన్‌గా చేసిన ఈమె సునీల్‌తో 'మర్యాద రామన్న' చిత్రంలో నటించింది. ఆ చిత్రం తర్వాత కెరీర్‌ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఇండస్ట్రీ అనుకుంది. తను కూడా భావించింది. ఇ

ఆయన చూపు నా మీద పడలేదన్న సలోని
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (17:44 IST)
ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలీదు. అది తెలీకే నేను ఇలా వున్నానని నటి సలోని తెలియజేస్తుంది. హీరోయిన్‌గా చేసిన ఈమె సునీల్‌తో 'మర్యాద రామన్న' చిత్రంలో నటించింది. ఆ చిత్రం తర్వాత కెరీర్‌ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఇండస్ట్రీ అనుకుంది. తను కూడా భావించింది. ఇదే విషయాన్ని ఆమెను అడిగితే.. అదేమిటో ఎందుకని నా కెరీర్‌ ఎదగలేదో నాకూ అంతుచిక్కలేదు. అంతా దైవ నిర్ణయం. ఆయన ఆశీస్సులు ఇంకా రాలేదేమోనని చెబుతోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టు పృధ్వీతో జోడిగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రంలో ఆయన సరసన నటించింది.
 
ఇందులో పాత్ర గురించి చెబుతూ.. ఇంటర్‌ చదివే యువతిగా నటిస్తున్నాను. నా కాలేజీలో పృథ్వీ ఇంటర్‌ చదువుతాడు. మా ఇద్దరి కాంబినేషన్‌ నవ్వు తెప్పిస్తుందని చెప్పింది. తన కెరీర్‌ ఇంకా అనుకున్నంతగా ఎదగలేదనడానికి రకరకాల కారణాలు వుండవచ్చనీ.. అందులో దేవుడి చూపు తనపై సరిగ్గా పడలేదని వెల్లడించింది. గ్లామర్‌ పాత్రలు చేయడానికి సిద్ధమయినా.. ఎందుకనో అవకాశాలు రావడంలేదని పేర్కొంది. మరి ఈ చిత్రం తర్వాత ఆమె కెరీర్‌ ఎలా వుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ చీరతో ఉరేసుకున్న హిమేష్ రేష్మియా.. సూసైడ్ నోట్ లేదు.. ఏమైందో?