పాక్ సింగర్ జాఫ్రీ అటాక్ తరహాలో నదీమ్పై దుండగుల కాల్పులు.. ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ?!
పాకిస్థాన్ సింగర్ అంజత్ జాఫ్రీ గుర్తుతెలియని దుండగుల చేతిలో కాల్పులకు గురై మరణించిన సంగతి విదితమే. ఈ విషాదం నుంచి కోల్కోక ముందే మరో నటుడిపై కాల్పుల మోత మోగింది. పాక్ నటుడు, యాంకర్, మ్యూజిషియ
పాకిస్థాన్ సింగర్ అంజత్ జాఫ్రీ గుర్తుతెలియని దుండగుల చేతిలో కాల్పులకు గురై మరణించిన సంగతి విదితమే. ఈ విషాదం నుంచి కోల్కోక ముందే మరో నటుడిపై కాల్పుల మోత మోగింది. పాక్ నటుడు, యాంకర్, మ్యూజిషియన్ నదీమ్ జాఫ్రీపై కొందరు దుండగులు కాల్పులు జరిపి అతని వద్దనున్న విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అదృష్టవశాత్తు నదీమ్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఆ దుండగులు నదీమ్ వద్దనుండి ఒక సెల్ ఫోన్, 13 వేల నగదు, చెక్లను తీసుకుని ఉడాయించారు.
అనంతరం నదీమ్ గుల్షాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నదీమ్ స్నేహితులతో కలిసి తన నివాసం ఎదుట కూర్చుని మాట్లాకుంటుండగా ఎవరో ఇద్దరు దుండగులు బైక్పై నుంచి వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారని... ఆ సమయంలో ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోగా కొంత మొత్తాన్ని పొగట్టుకున్నానని" పోలీసులకు తెలిపారు. అలాగే తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించమని పాక్ ప్రభుత్వాన్ని కోరినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.