Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్‌చరణ్ 'ఎవడు' తర్వాత ఎన్టీఆర్‌తో ఎమి జాక్సన్?

రామ్‌చరణ్ 'ఎవడు' తర్వాత ఎన్టీఆర్‌తో ఎమి జాక్సన్?
FILE
ఆంగ్ల నటీమణి అయిన ఎమి జాక్సన్ టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. మదరాసపట్టణంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఎమి జాక్సన్.. త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో నటించనుంది. "1947 ఎ లవ్‌స్టోరీ" ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎమి జాక్సన్.. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించనున్న కొత్త సినిమాలో తన అందాలను ఆరబోయనుందని టాలీవుడ్ వర్గాల భోగట్టా.

ప్రస్తుతం రామ్‌చరణ్ ఎవడు చిత్రంలో ఎమీ జాక్సన్ నటిస్తోంది. ఈ సినిమాకు తర్వాత ఎమి జాక్సన్ జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టనుందని తెలిసింది.

ప్రస్తుతం కోలీవుడ్‌లో శంకర్ దర్శకత్వం వహించే "ఐ" చిత్రంలో ఎమీ జాక్సన్ నటిస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అందచందాలు ఎమి జాక్సన్‌కు ఉన్నప్పటికీ.. అక్కడ అదృష్టం కలిసిరాకపోవడంతో దక్షిణ సినీ ఇండస్ట్రీపైనే దృష్టి సారించింది. అందుకే చేతికందిన ఆఫర్లను ఎమి జాక్సన్ సద్వినియోగం చేసుకుంటుంది.

అంతేకాదు.. ఇకపై దక్షిణాది సినిమాల్లోనే నటిస్తానని, ముంబైకి ఫ్లైట్ ఎక్కేది లేదని ఎమి జాక్సన్ నిర్ణయించుకుందట. మరి బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ వస్తే ఎమి జాక్సన్ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu