బాలకృష్ణ "ద్రోణ" చిత్రంకోసం బికినీలో ఫోజులిచ్చి టాలీవుడ్ కుర్రకారుకి కిర్రెక్కించిన ప్రియమణి మలయాళ నటుడు పృధ్వీరాజ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందట. ఇద్దరూ కలిసి తరచుగా కేరళలోని ప్రముఖ పబ్లు, రెస్టారెంట్లలో గంటలు గంటలూ గడుపుతున్నారట.
అదేమని అడిగితే... తామిద్దరం కలసి నటిస్తోన్న రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయనీ, ఈ చిత్రాల్లో ఎలా నటించాలనే అంశాల గురించి పరస్పరం చర్చించుకునేందుకు సమావేశమవుతున్నామని అంటున్నారట.
ఈ సంగతి ఇలా ఉంటే... కేరళలో గోల అవుతోందని ఇద్దరూ చెన్నై చెక్కేశారట. ఇప్పుడు చెన్నై పబ్బుల్లో, రెస్టారెంట్లలో మళ్లీ గంటలు గంటలు చర్చించుకుంటున్నారట. మరి ప్రియమణి ఈ విషయం గురించి ఏం చెపుతుందో.
చిత్రసీమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో సంప్రదాయమైన పాత్రలు పోషించిన ప్రియమణి... మెల్లగా ఎక్స్పోజింగ్ వైపు అడుగులేసింది. ద్రోణలోని బికినీ సన్నివేశాలతో తాను ఎటువంటి ఎక్స్పోజింగ్ చేయడానికైనా సిద్ధమేనన్న సంకేతాలను పంపింది. దీంతో నిర్మాతలు ఆమె కాల్షీట్లకోసం ఎగబడుతున్నారట.