"మగధీర" తర్వాత అంతటి రేంజ్ చిత్రాన్ని చేయడానికి రామ్చరణ్ కంగారుపడుతున్నాడు. ఆ చిత్రం తర్వాత ఎలాంటి చిత్రం చేయాలనే తర్జనభర్జనలతో 'ఆరెంజ్' తీసి దొరికిపోయాడు.
మళ్ళీ ఇప్పుడు అతన్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేయడానికి గమ్యం దర్శకుడు క్రిష్ ప్రయత్నిస్తున్నాడు. ఇది యూత్కు సంబంధించిన కథ. విద్యావిధానం, రాజకీయనాయకుల మధ్యసాగే కథ.
ఈ కథ పాయింట్ చెప్పగానే.. ప్రస్తుతం తాను ఎటువంటి ప్రయోగాలు చేయలేనని చెప్పేశాడట. ఎటొచ్చీ రాజకీయం కథ అంటే తన తండ్రికి చుట్టుకుంటుందన్న ఆలోచనతో రాంచరణ్ ఈ కథను తిరస్కరించినట్లు చెప్పుకుంటున్నారు. అవును కదా... మరీ.