చిగురించిన పాతస్నేహం.. నైట్ క్లబ్బుల్లో నయనతార - శింబు
, శుక్రవారం, 10 ఆగస్టు 2012 (13:49 IST)
నటి నయనతార మళ్ళీ పాత బాయ్ఫ్రెండ్తో స్నేహాన్ని కొనసాగిస్తుందని తెలిసింది. ప్రభుదేవాతో రామ్ రామ్ అయ్యాక.. ఒకటి రెండు చిత్రాల్లో బిజీ అయిన ఆమెకు గోపీచంద్ చిత్రం మధ్యలోనే ఆగిపోవడం బాధాకరమే. ప్రస్తుతం కేరళలోని స్వస్థలంలో విశ్రాంతి తీసుకుంటోంది. సినీవర్గాల సమాచారం ప్రాకరం ఒకనాటి ప్రియుడు శింబుకి చేరువ అవుతుందని తెలిసింది. ఈ విషయాన్ని శింబు మాటలు కొంతమేరకు కరెక్టే అనేట్లుగా ఉన్నాయి. నయనతార మనస్సున్న మనిషి. ఆమె, నేనూ మంచి స్నేహితులం. దానికి రొమాంటిక్ అంటూ వేరే కలర్ ఇవ్వడం అర్థంలేదు. అనవసర విషయాల గురించి మాట్లాడడం నాకు ఇష్టంలేదు. మా జీవితాల్లో ఎలాంటి చేదు అనుభవాలు లేవని చెబుతున్నాడు. అంటే తీపి జ్ఞాపకాలున్నాయనా అంటూ కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఇదిలావుంటే... నయన మాత్రం.. జీవితంలో అనుకోని విధంగా పలు సంఘటనలు జరిగాయి. అవి మనస్సును బాధించినా బాగా దృఢపర్చాయని చెబుతోంది. ఇదిలావుంటే ఇటీవల వీరిద్దరూ కలిసి హైదరాబాదులో నైట్ పార్టీల్లో చెట్టాపట్టాలేసుక తిరుగుతున్నట్లు చెపుతున్నారు.