ఒంటరిగా బాగుంటుంది కానీ వయసుకు వచ్చాకే... నయనతార
, బుధవారం, 10 జులై 2013 (17:29 IST)
ఒంటరితనం ఇప్పుడు కాదు... వయస్సు వచ్చాక కష్టమని నటి నయనతార చెబుతోంది. ప్రస్తుతానికి ఒంటరిగా ఉండటంలో ఆనందం చెప్పలేనిదని పేర్కొంది. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే చాలు.. మీడియాకు పెద్ద పండుగ అని చెబుతోంది. ఇటీవల తమిళనాడు ఆర్యతో చాలా చనువుగా ఉండటంతో వీరిద్దరూ ఒక్కటి కానున్నారనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆమె సమాధానమిచ్చింది. తను మంచి ఫ్రెండ్. ఫ్రెండ్స్తోనే ఎక్కువగా కబుర్లు చెపుతాం. దాన్ని సాకుగా తీసుకుని ఏవేవో కథలు అల్లేస్తున్నారని ఎదురు ప్రశ్నిస్తుంది. తను ఆర్యతో కలిసి కాఫీ షాప్ల చుట్టూ తిరిగామని చెపుతోంది. అది కేవలం స్నేహం మాత్రమే అంది. ఇక పెండ్లి విషయం ఇప్పుడు ఆలోచించే స్థితిలో లేనని స్పష్టం చేసింది.