Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జంటగా కనిపించని కోహ్లీ.. అనుష్క... విడిపోయారా?

జంటగా కనిపించని కోహ్లీ.. అనుష్క... విడిపోయారా?
, శుక్రవారం, 26 జూన్ 2015 (11:55 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నట్టు, వారిద్దరు విడిపోయారలనే వార్తలు వెల్లడవుతున్నాయి. క్రేజీ లవర్స్‌గా వెలిగి ఈ జంట విడిపోయారనే వార్త ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంలో వారిద్దరూ నోరుమెదపనప్పటికీ, దూరంగా ఉన్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
 
ఆ మధ్య ఎక్కడ చూసినా ఈ జంట కనిపించేది. దేశంలోనే కాదు టీమిండియా విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో కూడా అనుష్క అక్కడ వాలిపోయేది. వారిద్దరూ ఒకర్ని వదలి మరొకరు ఉండలేనంతగా, చట్టా పట్టాలు వేస్కొని వెళ్తున్న ఫోటోలు మీడియాలో హల్ చల్ చేశాయి. కోహ్లీ సెంచరీ కొట్టంగానే గ్రౌండ్ నుంచి గ్యాలరీలో కూర్చున్న తన ప్రియురాలికి ఫ్లయింగ్ కిస్‌లు పంపేవాడు. అది అప్పుడు పెద్ద దుమారాన్నే రేపింది.
 
అంతే కాదు ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక మ్యాచ్ సందర్భంగా విరాట్ దగ్గరకు వచ్చి అతనితో అనుష్క ముచ్చటించడం చర్చనీయాంశంగా మారింది. అంత ఘాటు ప్రేమలో మునిగిపోయిన ఈ ప్రేమ జంట ప్రస్తుతం ఎక్కడా జంటగా కనిపించడం లేదు. దీంతో వీరిద్దరు ఇప్పుడు విడిపోయారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu