Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెడ్ స్మగ్లింగ్ కేసు.. మే 7 వరకు జ్యుడిషియల్ కస్టడీకి నీతూ..!

రెడ్ స్మగ్లింగ్ కేసు.. మే 7 వరకు జ్యుడిషియల్ కస్టడీకి నీతూ..!
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (14:48 IST)
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన ''ప్రేమ ప్రయాణం'' చిత్ర హీరోయిన్‌ నీతూ అగర్వాల్ ఆదివారం కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేసి జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు నీతూను మే 7వ తేదీ వరకు కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. 
 
ఎర్ర చందనం అక్రమ రవాణాతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి నీతూ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టుచేశారు. ఆమె కారులో బెంగుళూరుకు పరారవుతుండగా హైదరాబాద్‌లో కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, స్మగ్లర్‌ బాలునాయక్‌ అకౌంటక్‌కు రూ.లక్ష బదిలీ చేసినట్టు నటి నీతూ అగర్వాల్‌ పోలీసులకు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్‌ మస్తాన్ వలీలో నీతూకు గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఆమె తీవ్ర మనోవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. నీతుని ఆదివారం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ను సీజ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆధారాల తర్వాతే అరెస్టు చేసినట్లు చెప్పారు. నీతు అగర్వాల్ పోలీసులకు చిక్కగానే ఏడ్చింది. మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు కూడా వెక్కివెక్కి ఏడ్చింది. 
 
కాగా, పోలీసుల విచారణలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ వలీ తనను శారీరకంగా హింసించాడని, తనను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. అతడి వేధింపులు తట్టుకోలేక తాను అతడికి లొంగిపోయానని, ఈ క్రమంలోనే ఆ రొంపిలోకి దిగవలసి వచ్చిందని చెప్పారు. 
 
మస్తాన్ వలీతో సంబంధాలు ఏర్పడ్డాక ఆమె తన కుటుంబానికి దూరమయ్యారు. నీతు అరెస్టైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు కర్నూలు వచ్చారు. ఇదిలావుండగా, స్మగ్లర్ బాలునాయక్ బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదలీ చేసినట్లు నీతు అగర్వాల్ పోలీసులకు చెప్పారు. ఆమె నుండి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఉపయోగించిన కారును సీజ్ చేశారు. మస్తాన్ వలీ, నీతు అకౌంట్ల మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu