Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుసుకోవడానికి ఐదేళ్ళు పట్టిందంటున్న హీరో!

తెలుసుకోవడానికి ఐదేళ్ళు పట్టిందంటున్న హీరో!
, గురువారం, 25 జూన్ 2015 (19:11 IST)
సినిమా సక్సెస్‌లో వుండగా.. తనేం చేస్తున్నాడో హీరోలకు తెలీదు. కానీ ఒక్కటి ప్లాప్‌ కావడంతో ఒక్కసారిగా వెనక్కు చూసుకుంటారు. సినిమాలో గాడ్ ఫాదర్‌గా వుంటేనే అవకాశాలు వస్తాయి. అలా వచ్చిన హీరో సందీప్‌ కిషన్‌. మొదట్లో అన్ని ఆఫీసులు తిరిగినా.. ఛోటా కె నాయుడు మేనల్లుడు అనే బ్రాండ్‌తో ముందుకు వచ్చాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఇచ్చిన కిక్‌ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ భ్రమలో కొన్ని కథల ఎంపికలో తప్పులు చేశానని అంటున్నాడు.
 
తాజాగా ఆయన నటించిన 'టైగర్‌' విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోగా వెనకబడ్డారనే దానికి బదులిస్తూ... అది తలచుకుంటుంటే వణుకు వస్తుందన్నారు. బీరువా సినిమా కొద్దిగా నిలబెట్టింది. ఈ కొత్త ధోరణి ఇండస్ట్రీ నుంచి తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టిందనీ, ఏ కథను ఎలా ఎంపిక చేసుకోవాలో అనేది బాగా గ్రహించానని అంటున్నాడు. అందుకే ఆలస్యమైనా కథంతా సిద్ధమయ్యాకే సెట్‌ పైకి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నానని అంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu