Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ తల్లికి రెండు కోట్లు.. అతిలోక సుందరి ఓకే..!

ప్రభాస్ తల్లికి రెండు కోట్లు.. అతిలోక సుందరి ఓకే..!
, మంగళవారం, 31 మార్చి 2015 (12:16 IST)
అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ స్పీడు పెంచింది. ఒక వైపు బాలీవుడ్‌లో నటిస్తూనే దక్షిణాది వైపు కూడా కన్నేసింది. రవి ఒడయార్ రూపొందించే 'మదర్' హిందీ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న శ్రీదేవి తాజాగా తెలుగులో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 
 
'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రభాస్ తల్లి పాత్ర కోసం చిత్ర దర్శకులు ప్రముఖ నటి కావాలనుకున్నారట. అందుకోసం శ్రీదేవిని సంప్రదించగా ఆమె కూడా వెంటనే ఓకే చెప్పేసిందట. 
 
అయితే రెండు కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తేనే అని మెలిక పెట్టిందట. అయినా దర్శకనిర్మాతలు ఓకే చెప్పినట్టు సమాచారం. కాగా ప్రస్తుతం శ్రీదేవి తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న 'పులి' సినిమాలో మహారాణి పాత్రలో నటిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu