Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడు రాధ కుమార్తె, ఇప్పుడు శ్రీదేవి కూతురు!

అప్పుడు రాధ కుమార్తె, ఇప్పుడు శ్రీదేవి కూతురు!
, గురువారం, 20 నవంబరు 2014 (22:38 IST)
అక్కినేని నాగార్జున తన కొడుకు నాగచైతన్యను సినిమాలో ఇంట్రడ్యూస్‌ చేయడానికి జోడీగా రాధ కుమార్తె కార్తీకను పరిచయం చేశారు. ఇప్పుడు మరో కొడుకు అఖిల్‌తో సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నెలాఖరులో షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈసారి అఖిల్‌ సరసన శ్రీదేవి కుమార్తె జాహ్నవిని ఎంపిక చేసే పనిలో వున్నారు. 
 
ఈ పాటికే చర్చలు జరిగాయి. ఇప్పటికే శ్రీదేవి తమిళంలో నటిస్తోంది. ఆమె కుమార్తె తెలుగులో నటించడం పెద్ద ప్లస్‌పాయింట్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ తెలియజేస్తుంది. గతంలో చైతన్య విషయంలో సరియైన ప్లానింగ్‌ లేకపోవడంతో ఈసారైనా అఖిల్‌ విషయంలో పూర్తి బాధ్యత తీసుకోవాలని పలుసార్లు నాగార్జున వెల్లడించారు.
 
నాగ్‌ ఫ్యామిలీ కూడా శ్రీదేవి కుమార్తెకే ఎక్కువ మార్కులు వేశారు. మొదటగా పలువురిని పరిశీలించారు. అయితే ప్రాజెక్ట్‌‌పై అంచనాలు పెరగాలంటే ఏదో ఒక ప్రత్యేకత వుండాలని నాగ్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu