ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా తన జీవితాన్ని మార్చేస్తుందని అంటోంది శ్రద్ధా కపూర్. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హైదర్' సినిమా గురించి ఈ బాలీవుడ్ బ్యూటీ చెబుతోంది. ''ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే ఓ అనిర్వచనీయమైన అనుభూతి పొందుతున్నాయి. సెట్స్లో తొలిసారిగా ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఓ భిన్నమైన ప్రపంచంలో ఉన్నట్లుగా కలుగుతోంది.
ఈ సినిమా నన్ను, నా జీవితాన్ని మార్చేసేలా వుంది' అంటోంది శ్రద్దా. ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత షేక్స్పియర్ రాసిన 'హేమ్లెట్' నాటిక ఆధారంగా విశాల్ దీన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో టబు, షాహిద్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జమ్ము కాశ్మీర్లో జరుపుకుంటోంది.