Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తన పాటను తానే పాడుకుంటూ.. గాయనిగా దూసుకుపోతున్న శ్రుతి..!

తన పాటను తానే పాడుకుంటూ.. గాయనిగా దూసుకుపోతున్న శ్రుతి..!
, ఆదివారం, 1 మార్చి 2015 (13:35 IST)
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా వెలిగే భామలు నటనలో మాత్రమే కాకుండా తమకు నచ్చిన సంగీతం, దర్శకత్వం, గానం వంటి రంగాలలో కూడా రాణిస్తున్నారు. ఆ కోవలో క్రేజీ బ్యూటీ శ్రుతి హాసన్‌గా కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. అమ్మడుకి గానం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
 
సినిమాలలో అందాల ఆరబోతతో అభిమానులను అలరిస్తూనే, అప్పుడప్పుడు పాటలను కూడా పాడుతుంది శ్రుతి. బాలీవుడ్‌లో మొన్న 'తేవర్'లో సోనాక్షి సిన్హాకు, నిన్న 'షమితాబ్'లో చెల్లెలు అక్షరకు పాడింది. తరువాత తెలుగులో 'ఆగడు'లో తాను నర్తించిన ప్రత్యేక పాటను కూడా పాడింది. ఇప్పుడు హిందీలో చేస్తున్న 'గబ్బర్'లో తన కోసం తొలిసారి పాడుకుంటోందట.
 
రొమాంటిక్, రాకింగ్ గా ఉండే ఆ పాటను శ్రుతి మీదే చిత్రీకరిస్తున్నారు. దీనిని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తోంది. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన తొలిసారి తను చేస్తోంది. ఇందులో అమలా పాల్, ప్రకాశ్ రాజ్, సోనూసూద్, కరీనాకపూర్ ఖాన్ లు అతిథి పాత్రల్లో నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu