హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ స్పెయిన్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఒక పాట మినహా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతుంది. కాగా త్వరలో ఆడియో రిలీజ్ విడుదల తేది ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, స్నేహ, బ్రహ్మానందం, సింధుతులాని, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.