Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బంగారు తల్లి'ని చూసి ఏడ్చిన సమంత... శ్వేతాబసు గురించి....

'బంగారు తల్లి'ని చూసి ఏడ్చిన సమంత... శ్వేతాబసు గురించి....
, శనివారం, 22 నవంబరు 2014 (14:45 IST)
నటి సమంత కళ్ళు చెమర్చింది. కమర్షియల్‌ సినిమాలు చూసిచూసి బోరు కొట్టినట్లుంది. ఈ మధ్య ప్రజాసేవ చేస్తుంది. అనాధల్ని, వికలాంగుల్ని ఆదుకుంటుంది. ఆ స్పూర్తితోనే.... నా బంగారు తల్లి సినిమా తిలకించింది. రాజేష్‌ టచ్‌రివర్‌ తీసిన ఈ సినిమా గురించి శనివారంనాడు ప్రసాద్‌ ల్యాబ్‌లో మాట్లాడింది. 
 
వ్యభిచార కూపంలో మగ్గుతున్న మహిళల దీనావస్థను కళ్ళకు కట్టినట్లు చూపించారు. చిత్రం చూసి ఆవేదన చెందాను. దేశంలో ఎంతోమంది అభాగ్యులు మోసపోయి ఇలా నరక కూపంలో ఇరుక్కుంటున్నారని పేర్కొంది. ఇటువంటి చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని తెలిపింది. 
 
కాగా, ఇటీవలే వ్యభిచార కేసులో ఇరుక్కున్న శ్వేతబసు గురించి ప్రస్తావించగానే.. ఇది సినిమా ప్రమోషన్‌ అంటూ దాట వేసింది.

Share this Story:

Follow Webdunia telugu