Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లు అర్జున్ తో రాశీ గుసగుసలు... ఏంటి సంగతి...?

అల్లు అర్జున్ తో రాశీ గుసగుసలు... ఏంటి సంగతి...?
, సోమవారం, 8 సెప్టెంబరు 2014 (18:56 IST)
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రేమకథా చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో బన్నీ రొమాన్స్ చేస్తాడనీ, సమంతను లీడ్ హీరోయిన్ గా ఆదాశ‌ర్మను మరో హీరోయిన్ గా తీసుకున్న సంగతి ఇప్పటికే వెబ్ దునియా తెలిపింది. ఇప్పుడిక మూడో క‌థానాయిక పాత్ర కోసం ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ఆక‌ట్టుకొన్న క‌థానాయిక రాశీఖ‌న్నాను తీసుకున్నట్లు టాలీవుడ్ న్యూస్. 
 
కాగా అల్లు అర్జున్ కొత్తచిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. అత్తారింటికి దారేది సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 నుంచి హైదరాబాదులో జరుగుతుంది.
 
స్క్రిప్ట్‌లో మార్పుల కోసం లేటుగా ప్రారంభమైన ఈ సినిమాలో బన్నీ ముగ్గురు కథానాయికలతో రొమాన్స్ చేయనున్నారు. వీరిలో ఇంతకుముందే సమంతా, ఆదాశర్మ ఎంపికయ్యారు. ఇక కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు. 'రేసుగుర్రం' వంటి భారీ హిట్ సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో నిర్మాణం పరంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu