Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ. కోటి డిమాండ్ చేసి రకుల్... మహేష్ సరసకు చేరడానికే..!

రూ. కోటి డిమాండ్ చేసి రకుల్... మహేష్ సరసకు చేరడానికే..!
, గురువారం, 14 మే 2015 (15:13 IST)
టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే మంచి క్రేజ్ పొందిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు స్థాయి ఎంతంటే ప్రతి కుర్ర హీరో రకుల్‌లే కావాలని పట్టుపడుతున్నారు. దీంతో అమ్మడు తన పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. 
 
మహేష్ బాబు సరసన నటించేందుకు లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ వారు తన దగ్గరికి వెళితే తను ఇలా డిమాండ్ చేసిందంట. ఇక వారు వేరే స్టార్ హీరోయిన్‌ని వెతుక్కోలేక తనని ఫిక్స్ చేసారంట. సమంత, శ్రుతి హాసన్ కోసం ఆ ప్రొడక్షన్ హౌస్ వారు చూశారట. కానీ, ఆ హీరోయిన్స్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో రకుల్‌ని తన డిమాండ్‌కి ఓకే చేసి ఒప్పుకున్నారంట. మహేష్ సరసన తను 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటించనుంది.

Share this Story:

Follow Webdunia telugu