Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూరీ ముహూర్తం పెట్టేశాడు... జూ.ఎన్టీఆర్ తో 9 గంటల 9 నిమిషాలకు...

పూరీ ముహూర్తం పెట్టేశాడు... జూ.ఎన్టీఆర్ తో 9 గంటల 9 నిమిషాలకు...
, బుధవారం, 30 జులై 2014 (21:01 IST)
పూరీ జగన్నాథ్‌ కొత్త చిత్రానికి ముహూర్త పెట్టేశాడు. ఎన్‌టిఆర్‌ చిత్రానికి దర్శకత్వం వహించనున్న చిత్రం ఇప్పటికే బౌండ్‌ స్క్రిప్ట్‌తో రెడీగా వుంది. ఇటీవలే పూరీ తన కొత్త ఆఫీసును స్నేహితుల సమక్షంలో ప్రారంభించారు. ఎన్‌టిఆర్‌ను కూడా ఆహ్వానించారు. కాగా, ఆగస్టు 1న ఎన్‌.టి.ఆర్‌.తో ముహూర్తపు షాట్‌ను తన కార్యాలయంలో తీయనున్నాడు.
 
ఇందుకు ఉదయం 9 గంటల 9 నిముషాలకు ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త ఆఫీసును పూరీ అధునాతనంగా తీర్చిదిద్దాడు. అన్ని విదేశీ హంగులే అక్కడ కన్పిస్తాయి. ప్రపంచంలోని వివిధ మేథావుల కొటేషన్లు, ఫొటోలు, పక్షులు అక్కడ కన్పిస్తాయి. అదేరోజు రభస ఆడియో వేడుకలు శిల్పకళావేదికలో జరుగనున్నాయి. దానికి పూరీ హాజరు కానున్నాడు. రెగ్యులర్‌ షూటింగ్‌ ఎన్‌టిఆర్‌తో ఆగస్టు నెలాఖరు నుంచి ప్రారంభం అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu