ఫేస్బుక్తో 'పెసరట్టు' ఏమిటి? అని ఆలోచిస్తున్నారా! నిజమే.. ఇటీవల టెక్నాలజీని యూత్ చాలా వుపయోగించుకుంటున్నారు. ఆ టెక్నిక్ తెలిసిన దర్శకులూ ఆ బాటనే పడుతున్నారు. శేఖర్ కమ్ముల తొలిసారిగా ఫేస్బుక్ ద్వారా కొందర్ని ఎంపిక చేసుకుని.. సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన బాటలో మహేష్ కత్తి అనే వ్యక్తి పయనిస్తున్నాడు.
'హృదయ కాలేయం' చిత్రంలో పోలీసు ఆఫీసర్గా నటించిన కత్తి మహేష్ 'పెసరట్టు' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ... వర్మను ఫాలో అవుతూ.. ఆయన నిర్మించిన 'ఐస్క్రీమ్' టెక్నాలజీతోనే సినిమా తీయాలని అనుకున్నాను.
ఫేస్బుక్లో పెడితే.. ఎంతోమంది స్పందించారు. సినిమాకు పార్టనర్స్ కూడా చాలా మంది వచ్చారు. వారంరోజుల్లో ఫేస్బుక్ ద్వారా వచ్చిన నటీనటులనుకూడా సెలక్ట్ చేసి సినిమా మొదలు పెడతాను. పెండ్లి, నిశ్చితార్థం నేపథ్యంలో కథ వుంటుంది. పూర్తి ఎంటర్టైన్మెంట్లో సాగుతుంది అనిచెప్పారు.