ప్రస్తుతం నితిన్ సినిమాలో నటించకుండా నిర్మాతగా మారారు. కొద్దికాలం క్రితం అఖిల్ సినిమాకు నిర్మాతగా మారాడు. ప్రస్తుతం ఆయన అక్కినేని అఖిల్తో నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఈ చిత్రం పూర్తయ్యే వరకు నితిన్ హీరోగా సినిమా చేయడని ఫిల్మ్నగర్ సమాచారం. అఖిల్తో నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకున్నాడట నితిన్.
అంతేకాదు అఖిల్ కూడా ఈ సినిమా పూర్తయ్యేవరకు మరో సినిమా మొదలుపెట్టవద్దని నితిన్కు చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. తను ఏవిధంగా సక్సెస్లు చేశాడో. అవన్నీ అఖిల్కు కొన్ని సూచనలుగా చేసి.. గట్టెక్కించే బాధ్యతను నితిన్ తీసుకున్నాడని సన్నిహితులు తెలియజేస్తున్నారు.