Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మల్టీ స్టారర్‌ చిత్రంలో నటించేందుకు ‘పటాస్’ హీరో రెడీ..!

మల్టీ స్టారర్‌ చిత్రంలో నటించేందుకు ‘పటాస్’ హీరో రెడీ..!
, ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (18:31 IST)
టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ హవా సాగుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, గోపాలా గోపాలా వంటి సినిమాలు హిట్ కావడంతో మల్టీ స్టారర్ మూవీలపై టాలీవుడ్ హీరోలు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం ఆ కోవలో పటాస్ విజయోత్సాహంలో మునిగి తేలుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ మూవీలో నటించేందుకు రెడీ అంటున్నాడు. 
 
ఈ విషయం గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ మంచి కథ దొరికితే బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌లతో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. పటాస్ విజయోత్సవంలో పాల్గొనడానికి తిరుమల వచ్చిన కళ్యాణ్ రామ్ వీఐపీ దర్శనంలో శ్రీవారిని సందర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మంచి కథ దొరికితే నందమూరి కథానాయకులతో మల్టీ స్టారర్ మూవీలో నటిస్తానని స్పష్టం చేశాడు.
 

Share this Story:

Follow Webdunia telugu