'మా'టీవీ అమ్మేసి మరో కొత్త ఛానల్ పెట్టడానికి కాదంటూ హీరో నాగార్జున అంటున్నారు. మాటీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడతో హైప్ తెచ్చాక.. ఆ ఛానల్కు వచ్చిన రేటింగ్తో ఎక్కువ రేటుకు పెట్టిన కొన్న స్టార్ ఛానల్కు పోటీగా తాను మరో ఛానల్ పెడతానన్న వార్తలో నిజంలేదని అంటున్నాడు.
అయితే ఇండస్ట్రీ మాత్రం వైజాగ్లో కూడా వుండాలన్నది తన అభిమతం కూడా తెలియజేస్తున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఆయన నటిస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయనా' చేస్తున్నాడు.
ఇదిలావుండగానే గత కొద్ది రోజులుగా నాగార్జున మరో కొత్త టీవీ చానల్ పెట్టనున్నారని, ఆ చానల్కి మనం అనే పేరు పెట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ రోజు నాగార్జున ఆ వార్తల్లో ఏం మాత్రం నిజం లేదని, అంతా వట్టి పుకార్లే అని చెప్పారు. 'మనం' అనే పేరుతో ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టడంలేదని ట్వీట్లో తెలియజేశాడు.