Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేము సైతం : మంచు విష్ణు, మనోజ్ కబడ్డీ టీమ్‌లకు రిఫరీగా మోహన్ బాబు!

మేము సైతం : మంచు విష్ణు, మనోజ్ కబడ్డీ టీమ్‌లకు రిఫరీగా మోహన్ బాబు!
, బుధవారం, 26 నవంబరు 2014 (12:53 IST)
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ నిర్వహించే ''మేము సైతం'' కోసం మోహన్ బాబు రిఫరీ అవతారమెత్తనున్నారు. తన తనయుల మధ్య పోటీకి విలక్షణ నటుడు మోహన్ బాబు మధ్యవర్తి పాత్ర పోషించనున్నారు. 
 
తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమంలో ఈ ముచ్చట చోటు చేసుకుంటోంది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30 మధ్యాహ్నం కబడ్డీ పోటీని ఏర్పాటు చేశారు. 
 
ఇందులో మంచు విష్ణు కెప్టెన్‌గా ఒక జట్టు, మంచు మనోజ్ కెప్టెన్‌గా మరో జట్టు తలపడతాయి. ఈ పోటీకి ఈ సోదరుల తండ్రి మోహన్ బాబు రిఫరీగా వ్యవహరించనున్నారు. ఆయా జట్లలో హీరోలు, హీరోయిన్లు, కమేడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu