Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ పేదరికానికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణం... మోడీ ఆరోపణ

భారత్ పేదరికానికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణం... మోడీ ఆరోపణ
, శనివారం, 30 మే 2015 (15:45 IST)
భారత దేశం పేదరికంలో మగ్గుతుండడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనేనని ప్రధాని మోడీ ఆరోపించారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదల పక్షాన పోరాడతామని చెబుతున్న కాంగ్రెస్ నిజంగా పేదల పక్షమే అయితే... దేశంలో పేదరికాన్ని ఎందుకు అంతం చేయలేకపోయరని ప్రశ్నించారు.
 
ఎన్డీయేది సూటు, బూటు పాలన అంటూ విమర్శిస్తున్నారని.. సూట్ కేసుల పాలన కంటే తమ పాలనే మంచిది కాదా అన్నారు. తమను విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. సొంత మనుషులకు బొగ్గు గనులను కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ సొంతమని మోడీ ఎద్దేవా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu