Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుల్లితెరపై చిరంజీవి: నాగార్జున కొన్ని ప్రశ్నలు వేస్తారు!

బుల్లితెరపై చిరంజీవి: నాగార్జున కొన్ని ప్రశ్నలు వేస్తారు!
, మంగళవారం, 22 జులై 2014 (10:48 IST)
'మా'టీవీలో అక్కినేని నాగార్జున చేపట్టి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌ను కొత్తపోకడలతో తెచ్చేందుకు నాగార్జున కంకణం కట్టుకున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు సాగే ఈ ప్రోగ్రామ్‌లో పాటిస్‌పెంట్స్‌చేత వారి వారి సమస్యలు వ్యక్తిగత విషయాలను తెలుసుకునే నాగార్జున.. ఆదివారంనాడు ప్రత్యేక ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఒక్కో ఆదివారం ఒక్కో ముఖ్యుల్ని ఆహ్వాస్తున్నారు. అమల, నాగచైతన్య, యాంకర్లు ఝాన్సీ, సుమలు హాజరై ప్రేక్షకుల్ని ఉత్సాహపరిచారని నాగార్జున అంటున్నాడు. ఇప్పుడు తాజాగా... చిరంజీవి బుల్లితెరపైకి తేనున్నాడు నాగార్జున. 
 
రాజకీయాలనుంచి మళ్ళీ సినిమాలవైపు మొగ్గుచూపుతున్న చిరంజీవి మీడియాకు దూరంగా ఉండడం తెలిసిందే. తన వాణిని ఇలా బుల్లితెర ద్వారా చెప్పనున్నట్లు సమాచారం. ఇందులో నాగార్జున.. కొన్ని ప్రశ్నలు వేయనున్నారనీ, అది వ్యక్తిగతంతోపాటు పార్టీ గురించి కూడా ఉంటాయని మాటీవీ వర్గాలు తెలియజేస్తున్నాయి. త్వరలో ఆ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

Share this Story:

Follow Webdunia telugu