Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బులు ఇవ్వాలంటూ బెల్లంకొండ ఇంటి ఎదుట మంచు లక్ష్మి అనుచరుల ధర్నా!

డబ్బులు ఇవ్వాలంటూ బెల్లంకొండ ఇంటి ఎదుట మంచు లక్ష్మి అనుచరుల ధర్నా!
, బుధవారం, 27 ఆగస్టు 2014 (10:14 IST)
తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఇంటి ఎదుట మంగళశారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నటుడు మోహన్‌బాబు కుమార్తె మంచులక్ష్మి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త ఏర్పడింది. మంచు లక్ష్మి నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలికిపడతారా...’ సినిమా సెట్టింగ్‌ను నిర్మాత బెల్లండ సురేశ్ 'రభస' సినిమా కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం రూ.58 లక్షలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. 
 
అయితే, రభస చిత్రం షూటింగ్ ముగిశాక.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డబ్బులు ఇచ్చేందుకు బెల్లంకొండ సురేష్ నిరాకరిస్తున్నారని మంచులక్ష్మీ ఆరోపిస్తోంది. దీంతో తనకు రావాల్సిన డబ్బుల కోసం తన అనుచరులతో బెల్లకొండ ఇంటి మందు ఆందోళన చేయించింది. అంతేకాకుండా, రభస చిత్రాన్ని తమ డబ్బులు చెల్లించిన తర్వాతే సినిమా విడుదల చేసుకోవాలంటూ వారు సురేష్ ఇంటి ఎదుట బైఠాయించారు. దీంతో ఫిలింనగర్‌లోని సురేశ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

Share this Story:

Follow Webdunia telugu