Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25 రోజుల్లో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'

25 రోజుల్లో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'
, మంగళవారం, 3 మార్చి 2015 (19:19 IST)
శర్వానంద్‌, నిత్యామీనన్‌ జంటగా నటించిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' విడుదలై 25రోజులకు చేరుకుంది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర సమర్పకులు కె.యస్‌.రామారావు మాట్లాడుతూ 'ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిసి చూసి చాలా పెద్ద హిట్‌ చేశారు. పవిత్రమైన ప్రేమ ఎప్పటికైనా ఫలిస్తుందన్న పాజిటివ్‌ అంశంతో నిర్మించిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రాన్ని యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ అంతా మళ్ళీ మళ్ళీ చూడడం వలనే ఇది ఇంత పెద్ద హిట్‌ అయింది. 
 
మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ నుండి ఓ మంచి కథాంశంతో మళ్ళీ ఓ సూపర్‌ డూపర్‌ హిట్‌ రావాలని కోరుకున్న మా మిత్రులు, శ్రేయోభిలాషుల శుభాశీస్సులతో 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' సెన్సేషనల్‌ హిట్‌ అవడమే కాకుండా 25 రోజులను పూర్తిచేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. ఈ విజయం మరిన్ని మంచి చిత్రాల్ని, గొప్ప చిత్రాల్ని నిర్మించడానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' సాధించిన విజయం మాది కాదు, మీది. ఉత్తమాభిరుచిగల ప్రేక్షకులందరిదీ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu