Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముగిసిన మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ : జోరుగా బెట్టింగ్స్!

ముగిసిన మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ : జోరుగా బెట్టింగ్స్!
, ఆదివారం, 29 మార్చి 2015 (14:37 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. సాధారణ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా సాగాయి. అయితే, ఈ పోలింగ్‌కు పలువురు అగ్రహీరోలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓట్లు వేసిన వారి సంఖ్య సైతం 57 శాతంగా నమోదైంది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ మొత్తాన్నీ వీడియో షూటింగ్ తీశారు. 
 
మొత్తం 6 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వినియోగించారు. జయసుధ, రాజేంద్ర ప్రసాద్‌ల మధ్య ప్రధాన పోటీ ఉండగా, ఎవరు గెలుస్తారన్న విషయంపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎవరు గెలిచినా సినీ పరిశ్రమ మొత్తం ఒకటేనని అటు రాజేంద్ర ప్రసాద్, ఇటు జయసుధ ప్రకటించారు. మొత్తం 394 ఓట్లు పోల్ అయినట్టు 'మా' ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu