Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా సొమ్మును మురళీమోహన్ దుర్వినియోగం చేశారు : ఒ.కళ్యాణ్

మా సొమ్మును మురళీమోహన్ దుర్వినియోగం చేశారు : ఒ.కళ్యాణ్
, శనివారం, 28 మార్చి 2015 (18:45 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు అధ్యక్షుడిగా ఉన్న రాజమండ్రి ఎంపీ, టీడీపీ నేత మురళీమోహన్ మా నిధులను దుర్వినియోగం చేశారంటూ నటుడు ఒ. కళ్యాణ్ ఆరోపించారు. అందువల్లే మాపై తన పట్టును కోల్పోకుండా ఉండేందుకే ఆయన నటి జయసుధను తన స్థానంలో అధ్యక్ష పదవికి పోటీ చేయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. 
 
ఈనెల 29వ తేదీ ఆదివారం జరుగనున్న 'మా' ఎన్నికల వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం రాజేంద్రప్రసాద్, జయసుధ వర్గాల మధ్య అగ్గిరాజుకుంది. ప్రస్తుత మా అధ్యక్షుడు మురళీమోహన్... జయసుధకు మద్దతిస్తుండగా, నాగేంద్రబాబు వర్గం రాజేంద్రప్రసాద్‌కు అండగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో, మురళీమోహన్ హయాంలో కొన్ని అవకతవకలు జరిగాయంటూ నటుడు ఒ.కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. అసోసియేషన్‌కు చెందిన సొమ్ములో ఐదు లక్షల రూపాయలను మురళీమోహన్ దైవ సన్నిధానానికి ఇచ్చారని ఆరోపించారు. సంఘం కార్యవర్గానికి ఈ విషయం తెలియదని అన్నారు. 
 
ఈ అంశంపై మురళీమోహన్‌ను మోహన్ బాబు కూడా ప్రశ్నించారని కల్యాణ్ వివరించారు. ఇక, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వెనకున్నది మురళీమోహనే అని అన్నారు. ఆటగాళ్లు ఎండలో ఆడితే వచ్చిన సొమ్మును సైతం దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డైరీల ముద్రణ విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. తాను ఈ విషయంలో ప్రశ్నించానని చెప్పారు. ఎన్నో ఉత్తరాలు రాశానని, దేనికీ బదులివ్వలేదని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu