Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఆ రెండు ముఖ్యమే'.. కృతి సనన్ స్పష్టం..!

'ఆ రెండు ముఖ్యమే'.. కృతి సనన్ స్పష్టం..!
, శనివారం, 21 మార్చి 2015 (15:36 IST)
ప్రిన్ మహేష్ బాబు సరసన వన్ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. తొలుత జాకీ ష్రాఫ్ కుమారుడు పంటి సినిమాతో టైగర్ ష్రాఫ్ సరసన నటించి మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ వన్ సినిమాలో భారీ డిజాస్టర్ అయ్యింది. 
 
ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ తనకు బాలీవుడ్, టాలీవుడ్ రెండు ముఖ్యమేనని స్పష్టం చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల్లో ప్రతిభ ఉన్న నటులు చాలామంది ఉన్నారని అంటున్నది. రెండు పరిశ్రమల్లో పనిచేస్తూ తానూ సరైన మార్గంలో పయనిస్తున్నట్లు విశ్వాసం వ్యక్తంచేసింది. 
 
ఇదిలా ఉంటె ఈ అమ్మడుకి అవకాశాలు ఈమధ్య బాగా వస్తున్నాయని సినీ జనం అంటున్నారు. ఆమెని కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా, తనని హీరోయిన్‌గా తీసుకోవాలని అమీర్ ఖాన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దాంతో అమీర్ సరసన కృతిసనన్ హీరోయిన్‌గా చేస్తుందని బాలీవుడ్ కథనాలు మొదలయ్యాయి. 
 
అదేవిధంగా మహేష్ వన్ సినిమాని బాలీవుడ్‌లో రిమేక్ చేసేందుకు అమీర్ ఖాన్ ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తుంది. తెలుగులో ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్ టాక్.

Share this Story:

Follow Webdunia telugu