Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'జోరు' పాటలు ఆవిష్కరణ

'జోరు' పాటలు ఆవిష్కరణ
, మంగళవారం, 7 అక్టోబరు 2014 (18:14 IST)
సందీప్‌ కిషన్‌ హీరోగా రాశిఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా హీరోయిన్లుగా శ్రీకీర్తి ఫిలింస్‌ పతాకంపై కుమార్‌ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జోరు'. అశోక్‌, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆడియో సీడీని నటుడు బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత ఎన్‌వి.ప్రసాద్‌ ఆవిష్కరించారు. లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదలైంది. చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు.
 
బ్రహ్మానందం మాట్లాడుతూ... ఈ సినిమా అంతా కామెడీగా వుంటుంది. సందీప్‌కిషన్‌ అద్భుతంగా చేశాడు. చిత్ర దర్శకుడు నా పాత్రను ప్రత్యేకంగా డిజైన్‌ చేశాడు. చిత్రం విజయవంతమయి నిర్మాతలకు లాభాలను చేకూర్చాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
సందీప్‌కిషన్‌ తెలుపుతూ... కుమార్‌ నాగేంద్రగారిపై నమ్మకంతో ఈ సినిమా చేశాను. నేను నమ్మినట్లుగానే సినిమా చక్కగా తెరకెక్కించారు. భీమ్స్‌ చాలా మంచి పాటలు ఇచ్చాడు. సినిమా మొదలు చివరివరకు హాయిగా నవ్వుకునేట్లుగా వుంటుంది అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ.. మా బేనర్‌లో చేస్తున్న తొలి సినిమా ఇది. 'గుండెల్లో గోదారి' సినిమాతో దర్శకుడు తనేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో కమర్షియల్‌గా దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడు అని చెప్పారు. సన్నివేశపరంగా పాటలు, దర్శకనిర్మాత అభిరుచిమేరకు సంగీతం ఇందులో వున్నాయని సంగీత దర్శకుడు భీమ్స్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu