Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జెండాపై కపిరాజు' అప్పుడే వస్తాడట...!

'జెండాపై కపిరాజు' అప్పుడే వస్తాడట...!
, బుధవారం, 30 జులై 2014 (17:45 IST)
వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తున్న 'జెండాపై కపిరాజు' మళ్లీ వాయిదా పడిపోయింది. 'నాని'..'అమలాపాల్' నటించిన ఈ జెండాపై కపిరాజుకు సముద్రఖని దర్శకత్వం వహించారు. అప్పట్లో ఆగస్టు ఎనిమిదిన విడుదల చేస్తామన్న టీమ్ మళ్లీ మరోసారి వాయిదా వేశారు. ఈ విషయాలను చెపుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు వారు. నాని మాట్లాడుతూ... ''తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. సమాజంలో ఇలాంటి పాత్రలు కనిపిస్తాయి. ఇది నాకు మంచి చిత్రమవుతుంద"ని అన్నారు.
 
నాని, అమలా పాల్, రాగిణి ద్వివేది హీరో హీరోయిన్స్‌గా శంబో శివశంబో వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన సముద్రఖని దర్శకత్వంలో రామ్మోహన్ రావు సమర్పణలో మల్టీ డైమన్షన్ ప్రై లి. పతాకంపై రజత్ పార్థసారధి, ఎస్ శ్రీనివాసన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జెండాపై కపిరాజు ఇటివలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న త్వరలో విడుదలకు సిద్ధం అయ్యింది. 
 
ఈ సందర్భంగా ఇటివల ప్రసాద్ లాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మల్టిడైమన్షన్ వాసు మాట్లాడుతూ... ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు కుడా పూర్తయ్యాయి. ఈ రోజు నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ప్రారంబించాము. ఆగస్టు నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu