Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య లావణ్యపై చీటింగ్ కేసు నమోదు : పూరీ జగన్నాథ్ వివరణ!

భార్య లావణ్యపై చీటింగ్ కేసు నమోదు : పూరీ జగన్నాథ్ వివరణ!
, శుక్రవారం, 29 ఆగస్టు 2014 (12:41 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు పూరీ జగన్నాథ్ భార్య లావణ్యపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. దీనిపై పూరీ జగన్నాథ్ వివరణ ఇస్తూ తన భార్య లావణ్య పేరు మీద జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలం ఉంది. దానిని సుబ్బరాజు, రామరాజు అనే బిల్డర్లకు అభివృద్ది నిమిత్తం ఇచ్చామన్నారు. వారు నాలుగు ఫ్లాట్స్ కట్టి అమ్ముకున్నారని తెలిపారు. 
 
ఒప్పంద సమయంలోనే తనకు బ్యాంకులో రూ.5 కోట్ల రుణం ఉందని బిల్డర్లకు చెప్పానని, వారు వాయిదాలు కట్టడానికి ఒప్పుకుని కొంతకాలం చెల్లించారని జగన్నాథ్ చెబుతున్నారు. కానీ ఆ బిల్డర్లు వాయిదాలు పూర్తిగా కట్టకపోవడంతో బ్యాంకు నోటీసు ఇవ్వడంతో సమస్య వెలుగులోకి వచ్చిందన్నారు. దీంతో ప్లాట్స్ కొన్నవారు తనను అపార్థం చేసుకుని కేసు పెట్టారని పూరీ వివరించారు. అంతేకానీ, తాను ఎవర్నీ మోసం చేయలేదని, తానే మోసపోయానని వాపోతున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu