Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందీ దృశ్యం: అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా!

హిందీ దృశ్యం: అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా!
, శుక్రవారం, 28 నవంబరు 2014 (15:27 IST)
హిందీ దృశ్యంలో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా నటించబోతున్నారు. మలయాళం, తెలుగు భాషల్లో హిట్ అయిన 'దృశ్యం' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటిస్తాడు. ఇక్కడ మీనా పోషించిన కథానాయిక పాత్రకు గ్లామర్ తార సోనాక్షి సిన్హా నటిస్తోంది.  
 
ఇదిలా ఉంచితే, దక్షిణాది భాషల్లో మలయాళం కథను ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించగా... హిందీలో స్వల్ప మార్పులు చేస్తున్నారు. కథానాయకుడి కూతురి పాత్రను అక్కడ చెల్లిగా మారుస్తున్నారు. మలయాళం ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు జీతు జోసెఫ్ హిందీ వెర్షన్‌కి కూడా పనిచేస్తాడు
 
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన 'దృశ్యం' భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కన్నడలో రవిచంద్రన్ హీరోగా 'దృశ్య' పేరిట రీమేక్ చేయగా, ప్రస్తుతం కమలహాసన్ దీనిని 'పాపనాశం' పేరుతో తమిళంలో చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. మొదట్లో హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ నటిస్తాడని వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా అజయ్ దేవగణ్ ఖరారయ్యాడు. మలయాళం ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ హిందీ వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహిస్తాడట.

Share this Story:

Follow Webdunia telugu