Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొదటి లుక్‌లోనే 'లౌక్యం'

మొదటి లుక్‌లోనే 'లౌక్యం'
, సోమవారం, 18 ఆగస్టు 2014 (20:37 IST)
గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'లౌక్యం'. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. ఈ చిత్రం మొదటిలుక్‌ టీజర్‌ సోమవారంనాడు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. గోపీచంద్‌ను కొత్తకోణంలో ఆవిష్కరించాం. చక్కని ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అలరిస్తుంది అన్నారు. 
 
నిర్మాత తెలుపుతూ... ఈనెల 20నుంచి స్విట్జర్లాండ్‌లో మూడు పాటల చిత్రీకరణ జరుగుతుంది. దాంతో చిత్రీకరణ పూర్తవుతుంది. సెప్టెంబర్‌ మొదటివారంలో పాటను, మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్‌ సీపాన, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, గోపీమోహన్‌, కెమెరా: వెట్రి, ఎడిటింగ్‌: శేఖర్‌.

Share this Story:

Follow Webdunia telugu