Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెర్రీ 'గోవిందుడు..' టిక్కెట్ల కోసం తొక్కిసలాట.. ఫ్యాన్ దుర్మరణం!

చెర్రీ 'గోవిందుడు..' టిక్కెట్ల కోసం తొక్కిసలాట.. ఫ్యాన్ దుర్మరణం!
, గురువారం, 2 అక్టోబరు 2014 (09:45 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్‌లో రాం చరణ్ తాజాగా నటించిన గోవిందుడు అందరివాడేలే చిత్రం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. 
 
ప్రేక్షకులకు సరియైన ఏర్పాటు చేయడంలో థియేటర్ యాజమాన్యం విఫలం కావడం వల్లనే ఓ వ్యక్తి మరణానికి కారణమైందని వారు విమర్శిస్తున్నారు. థియేటర్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా, బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం టిక్కెట్ల కోసం అనేక ప్రాంతాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu