త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో మూడో కథానాయికగా మొదట్లో ప్రణీతను ప్రణీతను ఎంపిక చేసుకున్నారని, తర్వాత నిత్యా మీనన్ను తీసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా నుంచి ప్రణీత తప్పుకోవడానికి త్రివిక్రమ్ కోపమే కారణమని సమాచారం. షూటింగ్లో ఓ రోజు ప్రణీతపై త్రివిక్రమ్ కోప్పడ్డటంతోనే ప్రణీత ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలిసింది.
సినిమాకి సంబంధించిన ఓ కీలక సన్నివేశంలో, ప్రణీత ఎలా ఉండాలో త్రివిక్రమ్ ఆమెకు ముందుగానే సూచించాడట. అయితే, షూటింగ్ రోజున ప్రణీత తాను ఊహించిన దానికి పూర్తి భిన్నమైన లుక్లో సెట్ లోకి రావడంతో, అందరిముందు త్రివిక్రమ్ ఆమెపై ఫైర్ అయ్యాడట.
దీంతో, తీవ్ర ఆగ్రహం చెందిన ప్రణీత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి వెంటనే సెట్ను వదిలి వెళ్లిపోయిందట. ఈ కారణంగా, ఆమె స్థానంలో హడావుడిగా నిత్యామీనన్ను త్రివిక్రమ్ ఎంపిక చేశాడని సమాచారం.