టాలీవుడ్ సీన్ మారింది.. ఇండస్ట్రీలో గూండాగిరి వచ్చేసింది.. అంటూ దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు. సినిమారంగంలోకి రావాలంటే.. బయట నుంచి వచ్చినవారికి అవకాశాలు పెద్దగా వుండట్లేదని చెప్పారు.
ఒకప్పుడు టాలెంట్, అందం, ఒడ్డు, ఒదుపూ వుండేవారిని వాయిస్ బాగుండేవారిని తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకులపై బలవంతంగా రుద్దేస్తున్నాడు. ఇండస్ట్రీలో గూండాగిరి వచ్చేసింది. సినిమాల్లో చూపించే గూండాగిరిని కంట్రోల్ చేసేవాడు హీరో.
కానీ రియల్లైఫ్లో హీరోలు లేరు. ఓ నలుగురు మాత్రమే వున్నారు. వారంతా థియేటర్లను కబ్జాచేసేశారు. దీంతో చాలామంది బలవుతున్నారు. మరోవైపు ప్రతిభ కనుమరుగైంది. కొత్తవారు రాలేకపోతున్నారు. పరిశ్రమ కుటుంబాలకు చెందినవారినే.... ముఖాల్ని చెక్కేసి రుద్దేస్తున్నారు.
ఇలాగే కంటెన్యూ అయితే.. పరిశ్రమ దుర్భరంగా మారిపోతుంది. అంటూ దాసరి నారాయణ రావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సోమవారం జరిగిన ఓ ఫంక్షన్లో దాసరి ఇలా వ్యాఖ్యానించారు. మరి దాసరి ఎవరిని ఇలా అన్నారో..?